Rabindranath Tagore Biography

రవీంద్రనాథ్ ఠాగూర్ బయోగ్రఫీ (Rabindranath Tagore Biography in Telugu)

రవీంద్రనాథ్ ఠాగూర్ (మే 7, 1861 – ఆగస్టు 7, 1941) (Rabindranath Tagore Biography)

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలియని వారు ఉంటారేమే గానీ ఆయన పేరు వినని భారతీయులు ఉండరు. ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. (Rabindranath Tagore Biography) నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. కవిత్వానికి ఠాగూర్ ప్రత్యేకం. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు.

Rabindranath Tagore Childhood and Education బాల్యం, విద్యాభ్యాసం

1861 మే 7న కలకత్తాలో దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యంలో కథలంటే చెవి కోసుకొనేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. చిన్న వయసు నుంచే రబీంద్రనాథ్ ఠాగోర్ సాహిత్యం పై మొగ్గు చూపారు. రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత 1883 డిసెంబరు 9 న మృణాలిని దేవీని వివాహమాడాడు.

సాహితీ వ్యాసంగం

రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన సంధ్యాగీత్ కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణకు అవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు విర్గరేర్ స్వప్న భంగ, సంగీత ప్రభాత అనే కావ్యాలను రచించాడు. ప్రపంచలోని ఎందరో ప్రముఖులతో ఠాగూర్ కు మంచి స్నేహం ఉంది. అయిన్ స్టీన్, జార్జ్ బెర్నార్డ్ షా, రొమైన్ రొల్లాండ్, రాబర్ట్ ఫ్రాస్ట్, డబ్ల్యూబి యిట్స్ ఇలా ఎందరితోనో ఠాగూర్ సాహిత్యం పై మాట్లాడేవారు. తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా చెప్పుకొన్నాడు.

Rabindranath Tagore Geetanjali గీతాంజలి

రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి.

శాంతినికేతన్

రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలకడం, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 1919 లో కళా భవన్ ను ఆయన స్థాపించాడు. ఇక్కడ విద్యార్థులు విభిన్న కళలను నేర్చుకునేవారు.

నవల, నాటకాలు

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు. రవీంద్రుడు మొదట “వాల్మీకి ప్రతిభ” అనే నాటకాన్ని రచించాడు. ఆ తరువాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి “పోస్టాఫీసు” అనే నాటకం వ్రాశాడు. రవీంద్రుడు రచించిన “చిత్రాంగద” నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. “ప్రకృతి – ప్రతీక” అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక శ్రేష్టమయిన నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన “గోరా” నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.

చిత్రకళ, సంగీతం

రవీంద్రనాథ్ ఠాగూర్ 70 ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు. రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరచిన వాడు రవీంద్రుడు.

స్వాతంత్ర్య సాధన, జనగణమణ

రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు.

రవీంద్రుడు వ్రాసిన “జనగణమణ” ను జాతీయ గీతంగా ప్రకటించేముందు “వందేమాతరం”, “జనగణమన” లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి “జనగణమన” దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు. 1919లో జల్లియన్ వాలా భాఘ్ ఉదందానికి నిరసనగా ఠాగూర్ నైట్ హుడ్ బిరుదును తిరిగి ఇచ్చేశారు.

మరణం

ఠాగూర్ 1941 ఆగస్టు 7న దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ కలకత్తా లో తుది శ్వాస విడిచారు.

జనప్రియమైన రవీంద్రుని ఒక రచన ఇక్కడ చూద్దాం.

“Where the mind is without fear; Where the mind is without fear and the head is held high; Where knowledge is free; Where the world has not been broken up into fragments by narrow domestic walls; Where words come out from the depth of truth; Where tireless striving stretches its arms towards perfection; Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit; Where the mind is led forward by thee into ever-widening thought and action—Into that heaven of freedom, my Father, let my country awake.”

దీనికి తెలుగు అనువాదం:

“ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో, ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో, తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు”

ఠాగూర్ కోట్స్

  • పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
  • కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజ్‌మహల్.
  • ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.
  • మనము ఎవరిని హీనులుగా, నీచులుగా చూస్తామో వాళ్లే మనల్ని క్రమంగా, హేయంగా, దీనంగా చూస్తారు.
  • అజ్ఞానమనేది విజ్ఞానము వైపుకు పయనించవచ్చు కానీ మూఢత్వమనేది మరణానికి దారి తీస్తుంది.
  • మంచి పనులు చేస్తూ తీరుబాటు లేకుండా ఉండే వ్యక్తికి సుఖంగా జీవించడానికి కాలం దొరకదు.
  • ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి.
  • అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను.
  • ఎవరైనాసరే నేర్చుకుంటూ ఉంటేనే తప్ప సరిగా బోధించలేరు.
  • అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
  • జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
  • మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.
  • నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.
  • కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.
  • భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.
  • వెలిగే దీపంలాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.
  • ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.
  • సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు.
  • మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.
  • మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.
  • ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే ‘కళ’.
  • నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.
  • సౌందర్యం, సత్యం వీటి రసవత్సమ్మేళనమే కళ

Read also..

CV Raman Biography in Telugu & English

CLICK HERE

error: Content is protected !!