Dr. Sarvepalli Radhakrishnan Biography

Dr. Sarvepalli Radhakrishnan Biography

     సర్వేపల్లి రాధాకృష్ణన్ (5 సెప్టెంబరు 1888  – 17 ఏప్రిల్ 1975) ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు. ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, తత్వవేత్త మరియు విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పదవులకే వన్నె తెచ్చిన ‘భారతరత్నం’. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలో.. విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ, చొరవ ఆయన్ను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఎదుటి వారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి సర్వేపల్లి. 1962 నుండి, భారతదేశంలో ప్రతీ సంవత్సరం అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా కొంటున్నాం. ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకం, తర్కం ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్విక చింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. (Dr. Sarvepalli Radhakrishnan Biography)

జననం & విద్యాభ్యాసం

   సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరంలో ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. అతని కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినది. అతని బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతిలో గడిపారు. అతని తండ్రి స్థానిక జమీందార్ దగ్గర సబార్డినేట్ రెవెన్యూ అధికారి.

     అతని ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కె.వి. హైస్కూల్‌లో సాగింది. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారి వృత్తి చేయమన్నాడు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే 1896లో ఉన్నత పాఠశాల చదువుకోసం ఆయన తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ పాఠశాలకు తరువాత వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారాడు. హైస్కూల్ విద్య కోసం అతను వేలూరులోని వూర్హీస్ కాలేజీలో చేరాడు. ఎఫ్.ఏ (ఫస్ట్ ఆఫ్ ఆర్ట్స్) తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత అతను 16 సంవత్సరాల వయస్సులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అతను 1907 లో అక్కడ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను అదే కళాశాల నుండి తన మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు.

      రాధాకృష్ణన్ తాను విద్యాభ్యసనలో ఎంచుకునే విషయాల కంటే యాదృచ్ఛికంగా తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు. ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థి కావడంతో, అదే కళాశాలలో పట్టభద్రుడైన బంధువు రాధాకృష్ణన్‌కు తన తత్వశాస్త్ర పాఠ్యపుస్తకాలను అందించినప్పుడు, అది అతని విద్యా కోర్సు తత్త్వశాస్త్రంగా స్వయం చాలకంగా నిర్ణయించబడింది. (Dr. Sarvepalli Radhakrishnan Biography in Telugu)

వివాహం & సంతానం

     రాధాకృష్ణన్ మే 1903లో 10 సంవత్సరాల వయస్సు గల శివకామమ్మ (1893–1956) తో తన 16 వ యేట వివాహం జరిగింది. ఆ దంపతులకు పద్మావతి, రుక్మిణి, సుశీల, సుందరి, శకుంతల అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారికి సర్వేపల్లి గోపాల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతను చరిత్రకారుడిగా చెప్పుకోదగిన వృత్తిని కొనసాగించాడు. భారత మాజీ క్రికెటర్‌ వీ.వీ.ఎస్‌. లక్ష్మణ్‌ ఆయన మేనల్లుడు. శివకామమ్మ 1956 నవంబర్ 26న మరణించింది.

ఉద్యోగం

     ఏప్రిల్ 1909లో, రాధాకృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ విభాగానికి ఫ్రొఫెసర్ గా నియమితులయ్యాడు. 1918లో మైసూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసరుగా నియమించబడ్డాడు. అలానే అతను మైసూర్‌లోని మహారాజా కళాశాలలో బోధించాడు.  అప్పటికి తన మొదటి పుస్తకం “ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌” ని కూడా పూర్తి చేశాడు. అతని రెండవ పుస్తకం, “ది రీన్ ఆఫ్ రిలిజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలాసఫీ” 1920లో ప్రచురించబడింది. 1921 లో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌ లో తత్వశాస్త్రంలో ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు. ఆసమయం లో అతను ‘భారతీయ తత్వశాస్త్రం’ అన్న గ్రంథం వ్రాశాడు 1926లో జరిగిన మరో ముఖ్యమైన విద్య సంఘటన ఏమిటంటే, 1929లో ఆక్స్‌ఫర్డ్‌లోని మాంచెస్టర్ కాలేజీలో హిబర్ట్ జీవిత ఆదర్శాలపై ఉపన్యాసాన్ని అందించడానికి ఆహ్వానం అందింది. ఇది “యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్‌”గా పుస్తక రూపంలో ప్రచురించబడింది.

      1931లో డా. సి.ఆర్.రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశాడు. 1931 నుండి 1936 వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకుడుగా పనిచేసాడు. 1939లో మదన్ మోహన్ మాలవ్య సూచనల మేరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) వైస్-ఛాన్సలర్‌గా జనవరి 1948 వరకు వైస్-ఛాన్సలర్‌గా పనిచేశాడు. 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించాడు.  1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడుగా పని చేసాడు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి ‘స్వాతంత్ర్యోదయం’ సందర్భాన రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు రాధాకృష్ణన్ నియమితుడైనాడు. 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసాడు. రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యాడు.

విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలు

      రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చాడు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై, ప్రేమాభిమానాలు చూపేవాడు. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి, తమ గురువును కూర్చోబెట్టి, రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

మరణం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏప్రిల్ 17, 1975న కన్నుమూశారు.

గుర్తింపు

  • 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందాడు.
  • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక “సర్” బిరుదు ఇతనును వరించింది.
  • 1954లో మెక్సికో ప్రభుత్వం ఆ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం” ఆర్డర్ ఆఫ్ ద అజ్ టెక్ ఈగిల్” పురస్కారాన్ని అందించింది.
  • 1961లో జర్మనీ పుస్తక సదస్సు శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందాడు.
  • 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు.
  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేటులు సంపాదించాడు.
  • ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.
  • 1938లో బ్రిటిష్ అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యాడు.
  • 1947లో ఇన్‌స్టూట్ ఇంటర్నేషనల్ డి ఫిలాసఫీలో శాశ్వత సభ్యునిగా ఎన్నిక.
  • 1959లో ఫ్రాంక్‌ఫర్ట్ నగరం యొక్క గోథే ప్లేక్ పురస్కారం.
  • 1961లో జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతి.
  • 1962 ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవానికి గాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజును సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1968లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్, ఒక రచయితకు సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత గౌరవం (ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఆయన).
  • 1975లో టెంపుల్‌టన్ ప్రైజ్ అందుకున్నాడు.
  • అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు, నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు.
  • 1988 లో భారత ప్రభుత్వ చలనచిత్ర విభాగం “సర్వేపల్లి రాధాకృష్ణ” పై డాక్యుమెంటరీ చిత్రం నిర్మించింది.

రచనలు

  • The Ethics of the Vedanta and Its Material Presupposition (1908)
  • The Philosophy of Rabindranath Tagore (1918).
  • The Reign of Religion in Contemporary Philosophy (1920).
  • Indian Philosophy (2 Editions) (1923, 1927).
  • The Hindu View of Life (1926).
  • The Religion We Need (1928).
  • Kalki or The Future of Civilisation (1929).
  • An Idealist View of Life (1932).
  • East and West in Religion (1933).
  • Freedom and Culture (1936).
  • The Heart of Hindusthan (1936).
  • My Search for Truth (Autobiography) (1937).
  • Gautama, The Buddha (1938).
  • Eastern Religions and Western Thought (1939, 2nd Edition 1969)
  • Mahatma Gandhi (1939).
  • India and China (1944).
  • Education, Politics and War (1944).
  • Is this Peace (1945).
  • The Religion and Society (1947).
  • The Bhagwadgita (1948).
  • Great Indians (1949).
  • East and West: Some Reflections (1955).
  • Religion in a Changing World (1967).

ఆంధ్ర గురించి సర్వేపల్లి గారి మాటల్లో..

     ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా ఉన్న సమయంలో మొదటి కాన్వకేషన్ ప్రసంగంలో, అతను తన స్థానిక ఆంధ్ర గురించి ఇలా మాట్లాడాడు, “మనం ఆంధ్రులం అదృష్టవశాత్తూ కొన్ని విషయాల్లో స్థితప్రజ్ఞులం. భారతదేశంలోని ఏ ప్రాంతమైనా సమర్ధవంతమైన ఐక్యతా భావాన్ని పెంపొందించుకో గలిగితే అది ఆంధ్రలోనే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సంప్రదాయవాదం పట్టు బలంగా లేదు. మన ఔదార్యత, మనస్సు యొక్క బహిరంగత బాగా తెలిసినవి. మన నైతిక భావం, సానుభూతి కల్పన సిద్ధాంతం వల్ల పెద్దగా తారుమారు కాలేదు. మా మహిళలు సాపేక్షంగా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారు. మాతృభాషపై ప్రేమ మనందరినీ బంధిస్తుంది.”

Read also..

Gidugu Venkata Ramamurthy Biography in Telugu 

CLICK HERE

error: Content is protected !!